12 July, 2026 | 3:47 PM

Breaking News

విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు   •   సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •  

వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు

19-12-2025 10:00 PM

ముకరంపుర,(విజయక్రాంతి): నగరంలోని తిరుమల్ నగర్ శ్రీ నిలయంలో మయూరగిరి పీఠాధిపతులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఆగమశాస్త్ర పండితులు నములకొండ రమణాచార్య స్వామి ఆధ్వర్యంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదాదేవి లోకానికి అందించిన ఆధ్యాత్మిక తత్వాన్ని తెలియజేస్తూ ఈ శ్రీ వ్రతాన్ని ఆచరించిన వారికి సుఖసంపదలు సకల సౌభాగ్యాలు కలిగి మనశ్శాంతి ఆరోగ్యం ఉంటుంది.

ప్రజలలో ప్రేమాభిమానాలు పెరుగుతాయని, దుష్ట ప్రవర్తన దూరమవుతుందని, సమాజ శ్రేయస్సు కలుగుతుందని అన్నారు. గోదాదేవి ఈ ధనుర్మాస వ్రతాన్ని లోకానికి అందించిందని అన్నారు. పలు ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణము భజనలు చేసి తీర్థప్రసాదనాలు తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రతిరోజు సాయంత్రం 5:30 నుంచి 6:30 గంటల వరకు శ్రీ విష్ణు సహస్రనా పారాయణం, తిరుప్పావై వైభవం ఉంటుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.