13 July, 2026 | 1:05 AM

14న అలంపూర్‌కు డిప్యూటీ సీఎం రాక

13-07-2026 12:07 AM

అలంపూర్, జూలై 12: గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో ఈ నెల 14న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మేడికొండ, పచ్చర్ల, జూ లేకల్, పుల్లూరు విద్యుత్ సబ్స్టేషన్లను ప్రారంభించనున్నారు. అనంతరం వడ్డేపల్లి మండలం జూలేకల్లో నిర్వహించే భారీ బహిరంగ సభలో భట్టి విక్రమార్కతో పాటు మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పాల్గొననున్నట్లు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.