18 April, 2026 | 10:07 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

గడువు పెంపు

18-04-2026 08:56 PM

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): జిల్లా షెడ్యూల్డు కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం (ఎస్సీ కార్పొరేషన్) ద్వారా 2025–26 ఆర్థిక సంవత్సరానికి పాడి గేదెలు పెంపకం పథకానికి మంచిర్యాల జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువతి, యువకులు దరఖాస్తు చేసుకునేందుకు గడువును పెంచినట్లు జిల్లా షెడ్యూల్డు కులముల సేవా సహకార అభివృద్ధి సంస్థ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ సిహెచ్ దుర్గాప్రసాద్ శనివారం తెలిపారు. అభ్యర్థులు ఆధార్ కార్డు, రేషన్ కార్డ్ లేదా ఆహార భద్రతా కార్డు, కుల, ఆదాయ ధృవీకరణ పత్రంతో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని, అలాగే పశుగ్రాసం పెంచడానికి కనీసం 10 గుంటల భూమి కలిగి ఉండాలన్నారు. అర్హులు ఈ నెల 23వ తేదీలోపు ఆన్ లైన్ వెబ్ సైట్ (https://tgobmms.cgg.gov.in ) లో దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు పత్రాలను మండలం లేదా మున్సిపాలిటీలో అందజేయాలని ఆయన కోరారు.