పీఏసీఎస్ను సందర్శించిన డీసీసీబీ సీఈఓ విశ్వేశ్వర్
19-08-2026 02:07 PM
ఆసిఫాబాద్(విజయక్రాంతి): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీసీసీబీ సీఈఓ విశ్వేశ్వర్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా సంఘం చైర్మన్ అలీబిన్ అహ్మద్, వైస్ చైర్మన్ ప్రహల్లాద్, బ్రాంచ్ మేనేజర్ వెంకట రవీందర్, సెక్రటరీ వెంకటరమణ ఆయనకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం సీఈఓ విశ్వేశ్వర్ సంఘంలో అందిస్తున్న వివిధ సేవలు, కార్యకలాపాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సంఘం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు, సలహాలు అందించారు. రైతులకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ సహకార సంఘాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.






