విద్యుత్తు షాక్తో పాడి ఆవు మృతి
06-10-2025 12:00 AM
మహమ్మదాబాద్ అక్టోబర్ 5: పాడి పశువులను పెంచుకుంటూ ఉపాధి పొందుదా మని ఆశించిన ఓ రైతుకు విద్యుత్ షాక్ అత ని కుటుంబంలో విషాదం మిగిల్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని జూలపల్లి గ్రామానికి చెందిన అల్లాడి బాలయ్య(బాల్ రెడ్డి) కి చెందిన ఆవు శనివారం సాయంత్రం మేతకు విడిచారు.
తన పొలం లో ఉన్న విద్యుత్ బుడ్డి కి తగిలి అక్కడికక్కడే ఆవు ప్రాణాలను కోల్పోయింది. ఈ అవును 15 రోజుల క్రితమే రూ 1లక్ష 6 వేలకు కొనుగోలు చేశారు. అప్పుసప్పుచేసి ఆవును తీసు కొచ్చి బతుకుదామనుకొని ఆశించిన ఆ రైతుకు విద్యుత్ షాక్ తో ఆవు మరణించడం తో ఆ కుటుంబం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని గ్రామస్తులు సైతం ఆవేదన వ్యక్తం చేశారు. తమన ఆదుకోవాలని రైతు కోరుతున్నాడు.




