calender_icon.png 17 February, 2026 | 4:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వామన్ రావు దంపతుల హత్య కేసు.. దోశులకు శిక్ష విధించాలి

17-02-2026 03:05:59 PM

మంథని బార్ అసోసియేషన్ అధ్యక్షులు హరిబాబు, ఉపాధ్యక్షుడు రఘోతం రెడ్డి

మంథని,(విజయక్రాంతి): వామన్ రావు దంపతుల హత్య కేసు సిబిఐ త్వరగా విచారించి దోశులకు చట్ట పరంగా శిక్ష విధించాలని మంథని బార్ అసోసియేషన్ అధ్యక్షులు హరిబాబు, ఉపాధ్యక్షుడు రఘోతం రెడ్డి కోరారు. మంథని బార్ అసోసియేషన్ ఆద్వర్యంలో కోర్టు ఆవరణలో న్యాయవాదులు గట్టు వామన్ రావు, నాగమణి దంపతుల 5వ వర్థంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూల మాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు హరిబాబు, ఉపాద్యక్షులు రఘోత్తం రెడ్డి మాట్లాడుతూ న్యాయ వాదులకు రక్షణ చట్టం త్వర గా తీసుక రావాలని, వామన్ రావు దంపతుల హత్య కేసు సిబిఐ త్వరగా విచారించి దోశులకు చట్ట పరిధి లో శిక్షలు అమలయ్యే విదంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు బాస్కర్ రెడ్డి, డి.విజయ్ కుమార్, కటుకం శ్రీనివాస్, స్రవంతి, శశి భూషణ్ కాచె, సతీష్, వ్యాస్, మన్సూర్ తదితరు పాల్గొన్నారు.