27 July, 2026 | 6:56 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

స్మశాన వాటికకు దారి నిర్మాణం

03-06-2026 07:31 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): పట్టణంలోని దస్నాపూర్ రెండో వార్డులో స్మశాన వాటికకు వెళ్లే దారిలో ఉన్న ఒర్రెపై పైపులు వేసి రహదారి నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వార్డు కౌన్సిలర్ గోవిందు బుధవారం శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు ఒర్రెపై కల్వర్టు లేకపోవడంతో ముఖ్యంగా వర్షాకాలంలో కాలనీవాసులు స్మశాన వాటికకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను గుర్తించిన చైర్మన్, కౌన్సిలర్ ప్రత్యేకంగా చర్యలు తీసుకుని పైపులు ఏర్పాటు చేసి రహదారి నిర్మాణాన్ని చేపట్టారు. రహదారి నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో రెండో వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాలనీవాసులు సంజు, మోహన్, ప్రణయ్, శ్రావణ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.