24 July, 2026 | 9:20 PM

జప్తి జనకంపల్లిలో బోర్ వెల్కు రీఛార్జి పిట్ ఏర్పాటుకు మార్కౌట్

24-07-2026 08:11 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని జప్తి జానకంపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ బోర్ వెల్ కు రీఛార్జి పిట్ ఏర్పాటు చేయుటకు మార్కౌట్ గ్రామ సర్పంచ్ వర్షిని,ఎంపీడీవో గంగాధర్,సూపర్డెంట్ ప్రవీణ్ కుమార్లు కలిసి ఇవ్వడం జరిగింది.ఎంపీడీవో గంగాధర్ మొదటిసారిగా గ్రామానికి వచ్చిన సందర్భంగా సర్పంచ్ వర్షిని శాలువాతో సన్మానించారు. అనంతరం గ్రామ పంచాయతీని సందర్శించి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులు జరగబోయే పనుల గురించి ఆరాధించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వర్షిని, ఎంపీడీవో గంగాధర్, ఏపీవో సక్కుబాయి, సూపర్డెంట్ ప్రవీణ్ కుమార్,ఈసీ సాయిలు,కార్యదర్శి శంకర్, జిపిఓ రాజు,ఫీల్డ్ అసిస్టెంట్ రాములు తదితరులు పాల్గొన్నారు.