3 March, 2026 | 9:57 PM

టీపీసీసీ అధ్యక్షుడికి ఆహ్వాన పత్రికను అందించిన కాంగ్రెస్ నేతలు

03-03-2026 08:15 PM

మనోహరాబాద్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ నేతలు ర్యాకల నరసింహారావు గౌడ్ మాజీ ఉపసర్పంచ్, ర్యాకల కృష్ణా గౌడ్, మాజీ ఎంపీటీసీ, బైరి ప్రశాంత్ గౌడ్ కొంపల్లి మాజీ కౌన్సిలర్ లు కాంగ్రెస్ టీపీపీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ నివాస గృహంలో మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందించారు.

మనోహరాబాద్ మండల కేంద్రంలో శ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ 12వ వార్షికోత్సవం వచ్చే ఆదివారం నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ కు ఆహ్వాన పత్రికను అందించి మర్యాద పూర్వకంగా ఆహ్వానించారు. ఇందులో కాంగ్రెస్ నేతలు, తదితరులు ఉన్నారు.