రోడ్డు ప్రమాద బాధితులకు పరామర్శ
13-05-2026 08:38 PM
నంగునూరు,(విజయక్రాంతి): భద్రాచలం నుంచి విజయవాడకు వెళ్తుండగా ప్రమాదానికి గురైన హనుమాన్ స్వాములను సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జ్ పూజల హరికృష్ణ పరామర్శించారు. నంగునూరు మండలం అప్పలాయ చెరువు, నర్మెట గ్రామాలకు చెందిన భక్తులు గాయపడి పట్టణంలోని సురక్ష ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం బాధితులకు ధైర్యం చెప్పి,మెరుగైన వైద్యం అందించాలని పూజల వైద్యులను కోరారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాపోల్ రాజ్ బహదూర్ రెడ్డి, కరుణకంటి రవీంద్ర చారి, ఎఎంసి వైస్ చైర్మన్ సాధుల పవన్ కుమార్, డైరెక్టర్లు ఎండి ఇమ్రాన్ తదితరులు ఉన్నారు.






