25 July, 2026 | 11:16 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

ఆగిపోయిన నాలా పనులు పూర్తి చేయండి

21-02-2026 12:00 AM

ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

బడంగ్పేట్, ఫిబ్రవరి 20: మధ్యంతరంగా ఆగిపోయిన ఎస్‌ఎన్డీపీ నాలా పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అధికారు లను ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభం అయ్యేలోపే ఈ పనులన్నీ ప్రజలకు అందుబాటులోకి రావాలని ఆమె స్పష్టం చేశారు. శుక్రవారం బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ చంద్రకళ,

డీసీపి సరస్వతి, వివిధ శాఖల అధికారులతో కలిసి నాలాల అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీ క్షా సమావేశం నిర్వహించారు. త్రాగునీటి సరఫరాపై ఆదేశాలు నాలా పనులతో పాటు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గ ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో ఎస్‌ఈ కిష్ట ప్ప, ఎస్‌ఎన్డీపీ ఈఈ వరలక్ష్మి, డీఈ అంజుమ్ సుల్తానా, డీఈ వెంకన్న పాల్గొన్నారు.