ముమ్మరంగా పల్స్ పోలియో
28-06-2026 01:00 PM
కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం ముమ్మరంగా పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతోంది. జిల్లా కలెక్టర్ అంకిత్ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉదయం ఏడు గంటల నుండి 0 - 5 ఐదేళ్ల లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయడం మొదలైంది.
పలుచోట్ల అధికారులు,కొన్ని ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులు చంటి పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తల్లిదండ్రులు, పోషకులు పిల్లలకు పోలియో చుక్కలు వేయించడానికి పల్స్ పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి పోలియో చుక్కలు వేయిస్తున్నారు.






