20 March, 2026 | 7:24 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

స్ట్రాంగ్ రూం, లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

08-10-2025 12:42 AM

మెదక్, అక్టోబర్ 7 (విజయక్రాంతి):స్ట్రాంగ్ రూం, ఓట్ల లెక్కింపుకు కేంద్రం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ మంగళవారం పరిశీలించారు. ఎంపి టిసి, జడ్పిటిసి, సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో గురుకుల పాఠ శాల, జూనియర్ కళాశాలలో ఏర్పాటు చే యనున్న స్ట్రాంగ్ రూములు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

స్ట్రాంగ్ రూముల భద్రత, సీసీ కెమెరా, పోలీస్ బందోబస్తు, ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగంపై ఆయన ఆరా తీశారు. ఎన్నికల సమయంలో ఎటువంటి లోపాలకు అవకాశం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచిస్తూ, లెక్కింపు రూముల్లో విద్యుత్, లైటింగ్, భద్రత వంటి అన్ని సౌకర్యాలు సక్రమంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికల అధికారులు అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి సౌకర్యాల కల్పనపై ధ్రువీకరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జెడ్పీ సీఈవో ఎల్లయ్య, మెదక్ ఆర్డీవో రమాదేవి, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు ఉన్నారు.