4 May, 2026 | 3:36 PM

Breaking News

సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేసిన మేయర్   •   అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలంటూ తాసిల్దార్ కు వినతి   •   తల్లి ఏడవకండి.. మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది   •   ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం   •   కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •  

నర్సింగ్ చేసిన వారికి విదేశాల్లో మంచి డిమాండ్

18-01-2026 02:15 PM

ఇంజినీరింగ్ కంటే... నర్సింగ్, మెడికల్ సైడ్ మంచి భవిషత్తు

హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఆదివారం పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... పేద ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వృత్తి ధర్మంలో బాధ్యతతో వ్యవహరిస్తే ఎంతో మందిప్రాణాలు రక్షించిన వారవుతారని సూచించారు.

ఈరోజుల్లో ఇంజినీరింగ్ చదువుకున్న వారికంటే నర్సింగ్, మెడికల్ సైడు ప్రపంచలో ఎన్నో గొప్ప గొప్ప అవకాశాలు ఉన్నాయని తెలిపారు. నర్సింగ్ చేసిన వారికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నర్సింగ్ ఉద్యోగులను ఎంత మందినైనా నియమించుకునే దేశాలు చాలా ఉన్నాయని వివరించారు. జపాన్, జర్మనీ పంపించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుందని వెల్లడించారు. విదేశాలకు వెళ్తేందుకు అవసరమైన భాష నేర్పించేందుకు కార్యాచరణ తీసుకుంటామని తెలిపారు.