10 June, 2026 | 11:32 AM

మోదీని కలిసిన రేవంత్ — తెలంగాణ రైజింగ్ సదస్సుకు ప్రధాని ఆహ్వానం!

03-12-2025 11:45 AM

ఢిల్లీ పర్యటనలో కీలక భేటీ


న్యూడిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. తెలంగాణ రైజింగ్ సదస్సుకు మోదీని ఆహ్వానించారు. గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Submit) గురించి సీఎం రేవంత్ ప్రధానికి వివరించారు. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిసిన రేవంత్, భట్టి విక్రమార్క తెలంగాణ రైజింగ్ సదస్సుకు రావాలని ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 8,9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సబ్మిట్ కు నిర్వహిస్తోంది. పార్లమెంట్ లో  లోక్ సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ(Lok Sabha Opposition Leader Rahul Gandhi), పలువురు కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సబ్మిట్ కు ఆహ్వానించనున్నారు.