తెలంగాణలో పెట్రోల్ కొరత.. సీఎం రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ మీటింగ్
25-03-2026 11:05 AM
పెట్రోల్, గ్యాస్ కొరతపై ముందస్తు జాగ్రత్తలు
హైదరాబాద్: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో తెలంగాణ(Telangana) రాష్ట్రంలో పెట్రోల్, గ్యాస్ సిలిండర్లు (ఎల్పీజీ), యూరియా నిల్వలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) అత్యవసర ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు శాసనసభ కమిటీ హాలులో మంత్రులు, ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించనున్నారు. రాష్ట్రంలో ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా, అలాగే పెట్రోల్, గ్యాస్ కొరత తలెత్తకుండా నిల్వల నిర్వహణ, ముందస్తు జాగ్రత్తలపై ఈ సమావేశంలో సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.




