15 April, 2026 | 12:07 AM

పేదలకు అండగా సిఎం సహాయ నిధి

14-04-2026 08:23 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నిరుపేదలకు సిఎం సహాయ నిధి వరమని మఠంపల్లి సర్పంచ్ ఏసుమల్ల వీర లక్ష్మిపాపయ్య అన్నారు. మంగళవారం మఠంపల్లి గ్రామంలోని పలువురు బాధితులకు మంజూరైన సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఉప సర్పంచ్ కొత్తపల్లి శౌరితో కలిసి పంపిణీ చేశారు. గ్రామంలో మొత్తం ముగ్గురికి రూ.2.10 లక్షల విలువైన చెక్కులు మంజూరైనట్లు తెలిపారు. హుజూర్ నగర్ లోని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదూరి కిషోర్ రెడ్డి,శుభోదయం యువజన సంఘం అధ్యక్షులు,వార్డ్ సభ్యులు గాదె జయ భారత్ రెడ్డి, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.