9 April, 2026 | 11:43 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

హెవీ డ్రైవర్ యూనియన్ సభ్యులతో సీజీఆర్ సమావేశం

09-10-2025 09:50 AM

గుమ్మడిదల: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీలోని సిజిఆర్ కార్యాలయంలో గుమ్మడిదల మండల హెవీ డ్రైవర్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి యూనియన్ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ... హెవీ డ్రైవర్ యూనియన్ సభ్యుల సమస్యలను త్వరలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాను. సభ్యులందరికీ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించేందుకు సిజిఆర్ ట్రస్ట్ తరఫున సహాయం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు బక్క సత్యనారాయణ, ఉపాధ్యక్షులు పి. యాదగిరి, సెక్రటరీ శంకర్ యాదవ్, కోశాధికారి నీరుడి ప్రవీణ్ కుమార్, కమిటీ సభ్యులు మల్లేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.