13 May, 2026 | 10:31 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

రాజకీయ పార్టీల ప్రతినిధులతో సీఈవో సమీక్ష

07-10-2025 05:15 PM

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల కమీషన్ పోలింగ్ తేదీని ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అంశంపై పలు రాజకీయ పార్టీలతో చర్చించిన సీఈవో ఈసీ సంస్కరణలు, కొత్త మార్పులను వివరించారు. ఈ ఉపఎన్నికల్లో ఈవీఎంపై అభ్యర్థుల కలర్ ఫోటోలు ఉంటాయని తెలిపారు. ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని రాజకీయ పార్టీలకు సీఆవో సూచనలు జారీ చేశారు.