27 March, 2026 | 5:24 AM

రాజకీయ పార్టీల ప్రతినిధులతో సీఈవో సమీక్ష

07-10-2025 05:15 PM

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల కమీషన్ పోలింగ్ తేదీని ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అంశంపై పలు రాజకీయ పార్టీలతో చర్చించిన సీఈవో ఈసీ సంస్కరణలు, కొత్త మార్పులను వివరించారు. ఈ ఉపఎన్నికల్లో ఈవీఎంపై అభ్యర్థుల కలర్ ఫోటోలు ఉంటాయని తెలిపారు. ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని రాజకీయ పార్టీలకు సీఆవో సూచనలు జారీ చేశారు.