11 July, 2026 | 8:55 PM

Breaking News

సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కళాశాల 16వ స్నాతకోత్సవం   •   జవహర్ నవోదయలో ప్రవేశాలకు ఆహ్వానం   •   గోపాల్ కుటుంబానికి అండగా ఉంటాం.. రూ.1 లక్ష ఆర్థిక సాయం: మాజీ మంత్రి కేటీఆర్   •   అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం   •   దివ్యాంగురాలిని ఆప్యాయంగా పలకరించిన జిల్లా కలెక్టర్   •   పినపాక మండలంలో ఎస్ఐఆర్ ప్రోగ్రామ్   •   శాతవాహన క్రీడా మైదానంలో 'సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్' నిర్మాణానికి భూమి పూజ   •   ఈనెల 13న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటన   •   మొదటి వేతనంతో పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన సర్పంచ్   •   లింగాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •  

వరద నష్టం అంచనాకు కేంద్ర బృందం మెదక్ జిల్లాలో పర్యటన ఖరారు

07-10-2025 12:04 AM

ఈనెల 8వ తేదీన జిల్లాలో పర్యటన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

వరద నష్టంపై కేంద్ర బృందం పర్యటన రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ,ఎన్నికల నియమ నిబంధనలకు లోబడి ఉంటుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టం అంచనా వేయనుందన్నారు. మెదక్, నిజాంపేట, రామాయంపేట, హవేలీ ఘనపూర్ , పాపన్నపేట మండలలలో పర్యటన కొనసాగుతుందన్నారు.

ఈ బృందంలో ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ, రోడ్లు, రహదారుల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విభాగాలకు చెందిన అధికారులు ఉన్నారని, కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అధికారులతో నేరుగా మాట్లాడనుందన్నారు.