27 April, 2026 | 11:50 AM

Breaking News

న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు: కేజ్రీవాల్ సంచలన నిర్ణయం   •   హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి   •   హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత.. ​ఎక్కడ చూసిన నో స్టాక్ బోర్డులు   •   నార్కెట్‌పల్లిలో రోడ్డు ప్రమాదం: సాఫ్ట్‌వేర్ మృతి   •   ప్రతి కుటుంబం ఖచ్చితంగా వివరాలు నమోదు చేసుకోవాలి: భట్టి విక్రమార్క   •   బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు.. ఒక విప్లవం!   •   శ్రీవారి సేవలో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు   •   దమ్మాయిగూడెం వద్ద రెండు లారీలు ఢీ   •   నిరుపేద చిన్నారి ప్రాణాల కోసం పోరాటం – దాతల సాయం కోసం తల్లిదండ్రుల విజ్ఞప్తి   •   బంకులు బంద్.. ప్రజలు పరేషాన్   •  

శతక సాహిత్య మంజరి పుస్తకావిష్కరణ

20-02-2026 12:00 AM

ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ హుస్సేన్

మెదక్, ఫిబ్రవరి 19(విజయ క్రాంతి) : తెలుగు సాహిత్యంలో విశిష్టమైన శతక సాహిత్య ప్రక్రియలో శతక సాహిత్య మంజరి అను పేరుతో ప్రచురించిన పుస్తకమును ఆవిష్కరించినట్టు ప్రి న్సిపల్ ప్రొఫెసర్ హుస్సేన్ తెలిపారు. తెలుగు సాహిత్యములో కల అనేక ప్రక్రియలలో శతక ప్రక్రియ ఒకటి. ఈ ప్రక్రియ పండిత, పామరలోకాన్ని, విద్యార్థులను అలరించిన ప్రక్రియ అని పేర్కొన్నారు.

తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ వాహనమూర్తి మాట్లాడుతూ సమాజానికి హితమును చేకూర్చే శతక సాహిత్య ప్రక్రియ గొప్పతనాన్ని పుస్తక రూపంలో వెలువరించినందుకు అధ్యాపకుడు వేణుగోపాల శర్మను అభినందించారు. వేణుగోపాల శర్మ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న తెలుగు అధ్యాపకులు, పరిశోధకుల నుండి శతక సాహిత్య ప్రక్రియ పైన వ్యాసాలను సేకరించి భావవీణ సంచికను వెలువరించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సింహారెడ్డి, డాక్టర్ ప్రవీణ్ కుమార్, డా క్టర్ తిరుమలరెడ్డి డాక్టర్ శరత్ రెడ్డి, డాక్టర్ అరుంధతి, డాక్టర్ జ్ఞానానందం, డాక్టర్ సుధాకర్, ఇతర అధ్యాపకులు, పరిపాలన అధికారి అంజాద్ అలీ, ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు.