18 May, 2026 | 2:12 PM

NEET UG paper leak కేసులో RCC వ్యవస్థాపకుడు అరెస్ట్

18-05-2026 01:11 PM

న్యూఢిల్లీ: నీట్ యూజీ (NEET UG) పేపర్ లీకేజీ కేసులో(NEET UG paper leak) మహారాష్ట్రలోని లాతూర్ నగరంలో 'రేణుకై కెమిస్ట్రీ క్లాసెస్' (RCC)ను నిర్వహిస్తున్న శివరాజ్ రఘునాథ్ మోటెగావ్‌కర్‌ను(Shivraj Raghunath Motegaonkar) సీబీఐ అరెస్టు చేసిందని అధికారులు సోమవారం తెలిపారు. ఆదివారం ఏజెన్సీ నిర్వహించిన సోదాల సమయంలో, మోటెంగావ్‌ంకర్ మొబైల్ ఫోన్‌లో వైద్య ప్రవేశ పరీక్షకు సంబంధించిన లీకైన ప్రశ్నపత్రం లభ్యమైంది. ఆ తర్వాత అతన్ని అరెస్టు చేశారు. NEET UG ప్రశ్నాపత్రం లీకేజీ, ప్రచారంలో ప్రమేయం ఉన్న వ్యవస్థీకృత ముఠాలో మోటెగావ్‌ంకర్ ఒక క్రియాశీల సభ్యుడని CBI ఆరోపించిందని అధికారులు తెలిపారు.

ప్రశ్నపత్రం లీక్ అయినట్లు వచ్చిన నివేదికల కారణంగా రద్దు చేయబడిన NEET UG 2026 పరీక్ష, ఇప్పుడు తిరిగి నిర్వహించబడనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇప్పుడు NEET UG 2026 పునఃపరీక్షను జూన్ 21, 2026న అధికారికంగా షెడ్యూల్ చేసింది. ఒక ఉన్నత స్థాయి విలేకరుల సమావేశంలో, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ ప్రకటించారు. 23 లక్షలకు పైగా వైద్య విద్య ఆశావహులు ప్రభావితం కావడంతో, NEET UG 2026 పునఃపరీక్ష తేదీ, అడ్మిట్ కార్డు, సిలబస్, పరీక్ష ప్రక్రియకు సంబంధించి గందరగోళం తీవ్రంగా కొనసాగుతోంది.

శివరాజ్ మోటెగాంకర్ ఎవరు?

రెండు దశాబ్దాలుగా, లాతూర్ విద్యార్థులు ఆదర్శంగా భావించిన ప్రతిరూపమే శివరాజ్ రఘునాథ్ మోటెగావ్‌కర్. కెమిస్ట్రీలో ఎం.ఎస్.సి. స్వర్ణ పతక విజేత, ఒక కోచింగ్ సామ్రాజ్య స్థాపకుడు, మరియు వైద్య, ఇంజనీరింగ్ టాపర్లను తయారు చేయడంలో నగరానికి ఉన్న ప్రసిద్ధ సంప్రదాయమైన "లాతూర్ ప్యాటర్న్"కు ఆయన ప్రతీక. ఈ సంప్రదాయాన్ని విద్యావేత్తలు గర్వంగా పిలుచుకునేవారు. నేడు, భారతదేశపు అత్యంత రాజకీయ ప్రకంపనలు సృష్టించిన పరీక్షా కుంభకోణాలలో ఒకటైన—NEET UG 2026 పేపర్ లీక్—కేంద్ర బిందువుగా అతని పేరు నిలిచింది. 1980 ఫిబ్రవరి 2న జన్మించిన మోటెగావ్‌కర్, 2003లో లాతూర్‌లో 'రేణుకై కెరీర్ సెంటర్' (RCC)ను స్థాపించారు. NEET, JEE, MHT-CET సన్నద్ధతపై దృష్టి సారించి, దీనిని మహారాష్ట్రలోనే అగ్రగామి రసాయనశాస్త్ర కోచింగ్ నెట్‌వర్క్‌గా తీర్చిదిద్దారని RCC వెబ్‌సైట్‌లోని ఆయన ప్రొఫైల్ పేర్కొంది.

సంవత్సరాలు గడిచేకొద్దీ, ఆర్‌సిసి మహారాష్ట్ర వ్యాప్తంగా పూణే, నాసిక్, ఔరంగాబాద్, నాందేడ్, సోలాపూర్, కొల్హాపూర్, అకోలా సహా ఎనిమిది నగరాలకు విస్తరించింది. ఆయన గ్రామీణ మార్గదర్శక కార్యక్రమాలు, ఉచిత సైన్స్ సెమినార్లు నిర్వహించేవారు. అండర్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సులలో ప్రవేశం కోసం మే 3న నిర్వహించిన NEET-UG 2026 పరీక్ష, ప్రశ్నపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో మే 12న రద్దు చేయబడింది. తదనంతరం, ప్రభుత్వం ఈ దర్యాప్తును CBIకి అప్పగించింది. ఒక ప్రైవేట్ మాక్ టెస్టులోని 42 ప్రశ్నలు అసలు పరీక్షలోని ప్రశ్నలకు అచ్చం నకళ్ళేనని ఆరోపిస్తూ స్థానిక తల్లిదండ్రులొకరు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు చిక్కుముడి వీడింది.