శివలింగం తొలగించిన వారిపై కేసు నమోదు
19-08-2026 09:32 PM
కొడిమ్యాల,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 903 లో గల భూమిలో మార్కండేయ దేవాలయ నిర్మాణంలో భాగంగా ప్రతిష్టాపన చేసిన శివలింగాన్ని, కాదాసు లచ్చులు, అతని అనుచరులు అట్టి భూమి తమదని, శివలింగాన్ని తొలగించినరని వారిపై చర్య తీసుకోవాలని అంకం రాజేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై నరేష్ కుమార్ తెలిపారు.






