27 June, 2026 | 2:19 PM

Breaking News

మల్లేపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం అక్రమాలపై 11 మందిపై కేసు నమోదు   •   ఎమ్మార్వోగా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర గ్రూప్-1 ప్రథమ ర్యాంకర్   •   ప్రమాదానికి మద్యం మత్తే కారణం   •   షాద్‌నగర్ ఆర్డీవో కార్యాలయంలో "ఎమ్మెల్యే" ఆకస్మిక తనిఖీ   •   సత్తుపల్లి మున్సిపాలిటీ 19వ వార్డు – తుమ్మూరి రామారావు వీధిలో ప్రజల దుస్థితి.   •   ఖమ్మం జిల్లాలో భారీ వర్షం.. రైతన్నల కళ్లలో ఆనందం   •   జ్యువెలరీ షోరూమ్‌లో రౌడీల వీరంగం   •   ప్రజల భవిష్యత్తును నిర్ణయించేది ఓటే: కమటం వెంకటేశ్వరరావు   •   నిండు వర్షంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి   •   బాన్సువాడ కల్కి చెరువు కట్టకు బుంగ...   •  

బ్యాంక్ ఆధీనంలో ఉన్న భూమిని కాజేసిన ఘటనలో పది మందిపై కేసు..

12-10-2025 09:02 PM

ఇద్దరు బడా రియాల్టర్లను రిమాండ్ కు తరలించిన పోలీసులు..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): జిల్లాలో భూ కబ్జా కేసులో చిన్న పెద్ద అనే తేడా లేకుండా తప్పు చేసిన భూకబ్జాదారులందరిపై కేసులు నమోదు అవుతున్నాయి. జిల్లా ఎస్పీగా అఖిల్ మహాజన్ బాధ్యతలు స్వీకరించాక రియల్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే ఎంతోమంది భూ మాఫియా దారులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. తాజాగా ఎస్.బి.ఐ బ్యాంకు అధీనంలోని భూమిని కబ్జా చేసిన ఘటనలో ఆదిలాబాద్ కు చెందిన బడా రియాల్టర్ లపై కేసులు నమోదు చేయడంతో పాటు రిమాండ్ కు తరలించడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

ఆదివారం డీఎస్పీ జీవన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. బ్యాంక్ ఆధీనంలో భూమిని కబ్జా చేసిన కేసులో రమేష్ శర్మ, ఇబ్రహీం మహమ్మద్ @ మామ్ల సేట్, యతేంద్రనాథ్, హితేంద్రనాథ్, రాకేష్ శర్మ మనోజ్ కుమార్ అగర్వాల్, పూనం వ్యాస్, అనుపమ వ్యాస్, సర్వేయర్ శివాజీలపై కేసు నమోదు చేశారు. ఇందులో రమేష్ శర్మ, మామ్లా సెట్ ను అరెస్ట్ చేసి, 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించడం జరిగిందని డిఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు.