17 March, 2026 | 7:48 PM

బీఆర్‌ఎస్ నాయకుడి తల్లి మృతి

17-03-2026 06:05 PM

మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం… 

సనత్‌నగర్,(విజయక్రాంతి): మాజీమంత్రి, సనత్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బిఆర్ఎస్ పార్టీ నాయకుడిని పరామర్శించారు. అమీర్ పేటకు చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు కుశ్వంత్ సింగ్ మాతృమూర్తి బిశ్వేశ్వర్ కౌర్ అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం అమీర్ పేట లోని వారి నివాసానికి వెళ్లారు.

ఆమె పార్దీవ దేహంపై పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుశ్వంత్ సింగ్, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, డివిజన్ బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నామన సంతోష్ మణికుమార్, నాయకులు జోగిందర్ సింగ్, దర్శన్ సింగ్, చన్నీ సింగ్, కూతురు నర్సింహ, సుమిత్ సింగ్ తదితరులు ఉన్నారు.