17వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
గజ్వేల్: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 17వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ కళ్యాణ్ కర్ పద్మ భాయ్ నర్సింగ రావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ జెండా ఎగరేశారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు కలిసి స్వీట్లు పంచుకుంటూ అమరవీరుల త్యాగాలతో సాధించిన రాష్ట్రంలో పార్టీ పోషించిన పాత్రను, సాధించిన అభివృద్ధిని గుర్తు చేసుకున్నారు. మాట్లాడుతూ... 26వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అమర వీరుల త్యాగాలతో సాధించిన తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించినది బీఆర్ఎస్ పార్టీయేనని తెలిపారు. అలాగే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చి కేసీఆర్ ని ముఖ్యమంత్రిగా చేయాలనే సంకల్పంతో ముందుకు సాగాలన్నారు.






