మొదటి సమావేశంలోనే “కుర్చీ” లొల్లి
మున్సిపల్ కార్యాలయం ఎదుట వైస్ చైర్మన్తో పాటు బిఆర్ఎస్ కౌన్సిలర్ల నిరసన
కాగజ్నగర్, (విజయక్రాంతి): కాగజ్నగర్ మున్సిపాలిటీ(Kagaznagar Municipality) నూతన పాలకవర్గం సర్వసభ్యుల ప్రారంభ సమావేశం ‘కుర్చీల’ లొల్లితోనే మొదలైంది. శనివారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించాల్సిన మొదటి సర్వసభ్య సమావేశానికి ముందే ఈ వివాదం చెలరేగింది. ప్రతి సర్వసభ్య సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ పక్కనే వైస్ చైర్మన్కు కుర్చీ ఏర్పాటు చేయడం ఆనవాయితీ. అయితే ఈ సమావేశంలో చైర్పర్సన్ పక్కన వైస్ చైర్మన్ కుర్చీ లేకపోవడంతో, వైస్ చైర్మన్తో పాటు బిఆర్ఎస్ కౌన్సిలర్లు అధికారులను ప్రశ్నించారు.
మున్సిపల్ వైస్ చైర్మన్(Municipal Vice Chairman) డాక్టర్ అనితకు చైర్పర్సన్ పక్కనే కుర్చీ వేయకపోవడంపై వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఒక మహిళా వైస్ చైర్మన్ను అవమానించడంపై బిఆర్ఎస్ కౌన్సిలర్లు వైస్ చైర్మన్కు మద్దతుగా నిలిచారు. దీనికి నిరసనగా వైస్ చైర్మన్తో పాటు బిఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ప్రారంభ సమావేశం కౌన్సిలర్ల మధ్య కుర్చీల లొల్లి, ప్రోటోకాల్ వివాదంతోనే ముగిసింది. ఈ కుర్చీల వివాదం ప్రధాన పార్టీలో చర్చనీయాంశంగా మారింది.




