ఎఆర్ఎస్ఐ శ్రీనివాస్కు ఘన సన్మానం
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎ.ఆర్.ఎస్.ఐ. శ్రీనివాస్ పదవీ విరమణ సందర్భంగా శనివారం ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై శ్రీనివాస్ను శాలువాతో సత్కరించి, పోలీస్ కో-ఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన రూ.1,57,146 విలువైన చెక్ను అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ శాఖకు మంచి పేరు తీసుకువచ్చినందుకు శ్రీనివాస్ సేవలను ప్రశంసించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఆయన పాత్ర అభినందనీయమని పేర్కొన్నారు.
శ్రీనివాస్ 1989లో కానిస్టేబుల్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, 2016లో హెడ్ కానిస్టేబుల్గా, 2021లో ఎ.ఆర్.ఎస్.ఐ.గా పదోన్నతి పొందారు. మూడు దశాబ్దాలకు పైగా వివిధ విభాగాల్లో సేవలందించి సహచరులకు ఆదర్శంగా నిలిచారని తెలిపారు.
పదవీ విరమణ అనంతరం ఆరోగ్యంగా, ఆనందంగా కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో జీవించాలని ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్.ఐలు, పోలీస్ సంఘ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.




