calender_icon.png 15 February, 2026 | 8:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తులకు మంథని పట్టణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అల్పాహారం ఏర్పాటు

15-02-2026 06:08:43 PM

మంథని,(విజయక్రాంతి): మహాశివరాత్రి పురస్కరించుకొని మంథని బస్ డిపో సమీపంలో పవిత్ర గోదావరి నదికి వెళ్లే భక్తుల కోసం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆశీస్సులతో మంథని పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు 10వ వార్డు కౌన్సిలర్ పెంటరి రాజు, యూత్ నాయకులు పెరుగు తేజ, మారుతి గౌడ్ అధ్వర్యంలో భక్తులకు అల్పాహారం  ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆయిలి ప్రసాద్ 5,  11వ వార్డు కౌన్సిలర్స్ ముస్కుల సయేందర్ రెడ్డి,  ఓడ్నాల శ్రీనివాస్, జిల్లా ఆర్టీఏ మెంబర్ మంథని సురేష్, జిల్లా మీడియా ఇంచార్జీ అరెల్లి కిరణ్ మాట్లాడుతూ... మంథని నియోజకవర్గ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.

పట్టణ యూత్ అధ్యక్షులు పెంటరి రాజు  బృందం గత మూడు సంవత్సరాల నుండి అల్పాహార వితరణ చేయడం జరుగుతుందని, ఈ సందర్భంగా వారిని అభినందించారు. ఆ పరమశివుని ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని అందరు సుఖసంతోషాలతో పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతున్ని కోరారు. మంత్రి శ్రీధర్ బాబు  మంథని ప్రాంతాన్ని అభివృద్ధి తీసుకురావడానికి వారు ఎంతో కృషి చేస్తున్నారని వారికి ఆ పరమశివుని ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని కోరారు.

ఈ ప్రాంత అభివృద్ధిని చూసి మున్సిపల్ ఎన్నికల్లో 13 సీట్లగాను 11 మంది సభ్యులను గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాతకు బహుమతి ఇవ్వడం జరిగిందని, రానున్న ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల్లో కూడా ఇదేవిధంగా ప్రజలు వారందరిని  ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, పట్టణ యూత్ కాంగ్రెస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.