హైదరాబాద్ ఐఎండీ కార్యాలయానికి బాంబు బెదిరింపు
హైదరాబాద్: బేగంపేట భారత వాతావరణ శాఖ (India Meteorological Department) కార్యాలయంలో 14 ఆర్డీఎక్స్ బాంబులను అమర్చినట్లు అధికారులకు బెదిరింపు ఇమెయిల్ అందడంతో కార్యాలయం భయాందోళనలు నెలకొన్నాయి. నివేదికల ప్రకారం, సిబ్బంది శుక్రవారం ఉదయం బెదిరింపు ఇమెయిల్ను(Threatening email) గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఐఎండీ కార్యాలయ భవనంలో ఆర్డీఎక్స్ కలిగిన బహుళ పేలుడు పరికరాలు ఉంచబడ్డాయని ఆ సందేశం పేర్కొన్నట్లు తెలుస్తోంది.
హెచ్చరిక తర్వాత, హైదరాబాద్ పోలీసులు(Hyderabad Police) సంఘటనా స్థలానికి చేరుకుని భద్రతా చర్యలు ప్రారంభించారు. భవనం, చుట్టుపక్కల ప్రాంతాలలో బాంబు నిర్వీర్య దళం, స్నిఫర్ డాగ్ బృందాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గంటకు పైగా కార్యాలయాన్ని పరిశీలించిన తర్వాత, ఎటువంటి పేలుడు పదార్థాలు కనిపించలేదని పోలీసులు ప్రకటించారు. దీంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బెదిరింపు ఇమెయిల్ చేసిన వారికి కోసం గాలిస్తున్నారు.




