22 April, 2026 | 2:30 PM

Breaking News

షాద్‌నగర్ చౌరస్తాలో మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దగ్ధం   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •  

సీఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నేత

22-04-2026 12:52 AM

జూబ్లీహిల్స్,ఏప్రిల్ 21 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరిం చుకుని బీజేపీ మహిళా మోర్చా జాతీయ నాయకురాలు, తమిళనాడు రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి శ్రీమతి డాక్టర్ పద్మ వీరపనేని ఆయనను మర్యాదపూర్వకముగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, రాష్ట్ర అభివృద్ధి పథంలో ఆయన నాయకత్వం మరింత పటిష్టంగా కొనసాగాలని ఆకాంక్షించారు. చంద్రబాబు నాయుడు అనుభవం, దార్శనికత రాష్ట్ర ప్రజల సంక్షేమానికి ఎంతో దోహదపడతాయని ఈ సందర్భంగా కొనియాడారు.