27 July, 2026 | 6:56 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

ఈదురు గాలులకు బీహార్ వాసి మృతి

09-06-2026 01:27 AM

రాజన్న సిరిసిల్ల జిల్లా నర్సింగాపూర్‌లో ఘటన

బోయినపల్లి: జూన్ 8 (విజయక్రాంతి): సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నర్సింగాపూర్ ప్రధాన రహదారిలో ఆదివారం సాయంత్రం వచ్చిన ఈదురు గాలులతో బీహార్‌కు చెందిన ఎండీ శంషాద్ (28) అనే వ్యక్తి మృతి చెందాడు. బీహార్‌కు చెందిన శంషాద్ నర్సింగాపూర్ ప్రధా న రహదారిలో తాత్కాలికంగా పంచర్ షాపు నడుపుతున్నాడు.

ఆదివారం సాయంత్రం భారీ ఈదురు గాలులు వర్షం రావడంతో షాప్ కొట్టుకపోయింది. అందులో ఉన్న శంషాద్‌కు  తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందా డు. కుటుంబీకులకు సమాచారం అందించారు.