26 April, 2026 | 10:37 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం కోటి 61 లక్షలు

19-11-2025 07:52 PM

భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి హుండీ లెక్కింపు బుధవారం నాడు చిత్రకుట మండపంలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో అత్యంత భద్రత మధ్య లెక్కించారు. వివిధ హుండీల ద్వారా స్వామివారికి కోటి 61 లక్ష ల రెండువేల 694 రూపాయలు వచ్చింది. అంతేకాకుండా 141 గ్రాముల బంగారం 800 గ్రాముల వెండి కూడా ఉండి ద్వారా లభించింది.

వీటితోపాటు 347 అమెరికా డాలర్లు, 31 సింగపూర్ డాలర్లు, 30 కొరియా డాలర్లు 11 సౌత్ కొరియా వాన్స్, 2 మలేషియా రింగ్ గన్స్ తో పాటు మరో 125 డాలర్స్ వివిధ దేశాలకు చెందిన నగదు లభించింది. లెక్కించిన నగదును భద్రాచలం దేవస్థానం ఈవో దామోదర్ రావు దేవస్థానం అధికారుల సమక్షంలో బ్యాంకు అధికారులకు అందజేసి స్వామివారి అకౌంట్లో జమ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు శ్రావణ్ కుమార్ రామకృష్ణ శ్రీనివాస్ రెడ్డి తో పాటు పలువురు పాల్గొన్నారు.