18 July, 2026 | 1:19 PM

Breaking News

Skyroot Vikram-1: స్కైరూట్ విజయం.. దేశయువతకు స్ఫూర్తి   •   సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

ధైర్యంగా ఉండండి..అండగా ఉంటాం

06-10-2025 12:04 AM

-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు 

-అమెరికాలో మృతి చెందిన చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు పరామర్శ

ఎల్బీనగర్, అక్టోబర్ 5 :  అమెరికాలోని డల్లాస్ లో జరిగిన కాల్పుల్లో మృతి చెందిన చంద్రశేఖర్ కుటుంబ సభ్యులను ఆదివారం బీఎన్ రెడ్డి డివిజన్ లోని టీచర్స్ కాలనీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పరామర్శించారు. ధైర్యంగా ఉండండి.. అండగా ఉంటామని కుటుంబ సభ్యులతో మాట్లాడి మనోధైర్యం నింపారు. ప్రభుత్వం తరపున అన్నివిధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి, బీఎన్ రెడ్డి కార్పొరేటర్ లచ్చిరెడ్డి తదితరులు ఉన్నారు.