6 April, 2026 | 4:46 PM

Breaking News

కరీంనగర్‌లో ఘనంగా భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు   •   ఢిల్లీ అసెంబ్లీ దగ్గర హైటెన్షన్.. వీఐపీ గేటులోంచి దూసుకొచ్చిన మాస్క్ మ్యాన్ కారు   •   ఉపాధి హామీ పనిలో విషాదం – మహిళ మృతి   •   గోపాలరావుపల్లిలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ఘనంగా నిర్వహణ   •   మాజీ ఎంపీటీసీ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం   •   సెస్ విలీనంతో పారదర్శక పాలన వినియోగదారులకు నాణ్యమైన సేవలు   •   ముఖ్యమంత్రిని సన్మానించిన ఖానాపూర్ కాంగ్రెస్ కౌన్సిలర్లు   •   ఉమామహేశ్వరంలో ప్రభుత్వ విప్ ప్రత్యేక పూజలు   •   ఢిల్లీ హైకోర్టుకు కేజ్రీవాల్.. లిక్కర్ కేసు విచారణ వాయిదా   •   హిందూ సమ్మేళనానికి రూ 5100 విరాళం   •  

ధైర్యంగా ఉండండి..అండగా ఉంటాం

06-10-2025 12:04 AM

-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు 

-అమెరికాలో మృతి చెందిన చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు పరామర్శ

ఎల్బీనగర్, అక్టోబర్ 5 :  అమెరికాలోని డల్లాస్ లో జరిగిన కాల్పుల్లో మృతి చెందిన చంద్రశేఖర్ కుటుంబ సభ్యులను ఆదివారం బీఎన్ రెడ్డి డివిజన్ లోని టీచర్స్ కాలనీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పరామర్శించారు. ధైర్యంగా ఉండండి.. అండగా ఉంటామని కుటుంబ సభ్యులతో మాట్లాడి మనోధైర్యం నింపారు. ప్రభుత్వం తరపున అన్నివిధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి, బీఎన్ రెడ్డి కార్పొరేటర్ లచ్చిరెడ్డి తదితరులు ఉన్నారు.