18 July, 2026 | 12:58 PM

Breaking News

Skyroot Vikram-1: స్కైరూట్ విజయం.. దేశయువతకు స్ఫూర్తి   •   సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

అప్పుల బాధ,సరైన పని లేక మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య

06-10-2025 12:05 AM

రాజన్న సిరిసిల్ల: అక్టోబర్ 5 (విజయక్రాంతి) సిరిసిల్ల పట్టణం బి. వై. నగర్ లో అ ప్పుల బాధ, సరైన పని లేకపోవడంతో కు టుంబ పోషణ భారం కావడంతో మనస్తా పం చెందిన ఓ వ్యక్తి తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘ టన చోటు చేసుకుంది. మృతుడిని స్వర్గం రమేష్గా గుర్తించారు. బి.వై. నగర్లో అద్దె ఇం ట్లో నివాసముంటున్న రమేష్ గత కొంతకాలంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమ వుతున్నాడు.

ఈ కుటుంబానికి సుమారు రూ. 20 లక్షల అప్పు ఉన్నట్లు సమాచారం. అప్పులు తీర్చే మార్గం లేక, కుటుంబాన్ని పో షించడం కష్టంగా మారడంతోనే రమేష్ ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భార్య సంధ్య, కూతురు నిహారిక 13, కొడుకు మదన్ 11 తో కలిసి ఉంటున్న రమేష్, ఆర్థిక సమస్యల కారణంగా తమ ఉన్న ఇంటిని కూ డా అమ్ముకోవాల్సి వచ్చి అద్దె ఇంట్లో ఉం టున్నారు.

ఈరోజు తెల్లవారుజామున రమే ష్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం తో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.