22 May, 2026 | 10:49 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

ఆరోగ్యంపై అవగాహన ఉండాలి

17-11-2025 12:38 AM

ములకలపల్లి, నవంబర్ 16 (విజయక్రాంతి): కౌమార బాలికలు ఆరోగ్యం పై అవ గాహన కలిగి ఉండాలని గుడ్ షెఫర్డ్ సంస్థ సిస్టర్స్ సూచించారు.ములకలపల్లి లోని గుడ్ షెఫర్డ్ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం సుమారు 80 మంది బాలికలు, కౌమార బా లికలకు ఆరోగ్యపరమైన అంశాలపై, పౌష్టిక ఆహారంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో సంస్థ సిస్టర్ తో పాటు వైద్య సిబ్బంది రమాదేవి పాల్గొని వారికి పౌష్టికాహారం ప్రాము ఖ్యత,ఆరోగ్య సంరక్షణ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

అదేవిధంగా రుతుక్రమ సమయంలో పాటించ వలసిన పరిశుభ్రతపై కిశోర బాలికలకు వివరించారు. యుక్త వయసులో శారీరకంగా మానసికంగా ఎదుగుదలకు సంబంధించి సంతులిత ఆహారాన్ని తీసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో గుడ్ షెఫర్డ్ సిస్టర్స్ ఉదయ, దీప్తి, రాజ్యం, బెనూషియా సంస్థ సిబ్బంది సుజాత,సాగర్ నాగరాజు, సందీప్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.