3 April, 2026 | 1:44 PM

Breaking News

కొండాపూర్‌లో డ్రగ్స్ కలకలం.. పబ్‌లో సినీనటి హేమ   •   బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ — అమ్మవారి జాతరకు వెళ్లొస్తూ ముగ్గురు దుర్మరణం   •   తూప్రాన్‌లో శ్రీరాముడి రథోత్సవం.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య వివాదం   •   దొడ్డి కొమరయ్య... నేటి ప్రజావ్యతిరేక పోరాటలకు స్పూర్తి: కేసీఆర్   •   బహుజన ఆత్మగౌరవ ప్రతీక దొడ్డి కొమురయ్య   •   దక్షిణాసియా వస్త్ర రాజధానిగా తెలంగాణ — సీఎం రేవంత్ రెడ్డి   •   కలెక్టర్ ఆదేశాలు బే ఖాతర్   •   Warangal Sub-Registrar Officeలో సోదాలు.. అక్రమాల గుట్టు విప్పిన ఏసీబీ   •   సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం... గ్రూప్-1 ఆశావహులకు ఇది పెద్ద ఊరట   •   ఇల్లందు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా భూక్యా రవి కుమార్ నాయక్   •  

ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ..

30-11-2025 09:30 PM

నారికేళ స్వామి చెన్నారెడ్డినీ సన్మానించిన మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్..

పెద్దమందడి: వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం దోడగుంటపల్లి గ్రామానికి చెందిన నారికేళ స్వామి చెన్నారెడ్డి పడిపూజ ఘనంగా నిర్వహించారు. ఈ పడిపూజ కార్యక్రమములో మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ పాల్గొని చెన్నారెడ్డి స్వామిని సన్మానించారు. ఈ పూజ కార్యక్రమం గురుస్వాములు గోవిందరెడ్డి, ముత్తు కృష్ణ కరకమలములచే అత్యంత దేదీప్యమానంగా జరిగింది. గణపతిహోమం, పల్లకిసేవ, కుంకుమార్చన అభిషేకం అష్టోత్తరం మహపడిపూజ జరిగాయి.

ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ 18 సార్లు మాలవేసుకొని శబరిమల యాత్ర చేయడం పూర్వజన్మసు కృతమని అన్నారు. అయ్యప్ప దీక్షలతో మానసిక ప్రశాంతత,ప్రజలలో భక్తి ప్రభత్తులు, ఐకమత్యం పెంపొందుతాయి అని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి గురుస్వాములు రఘుమారెడ్డి కృష్ణసాగర్ నరేందర్ అశోక్ రెడ్డి గట్టు శశి  పాపిరెడ్డి అనిల్  రాకాసి శ్రీనివాస్ రెడ్డి మేఘాశ్యం రెడ్డి రామకృష్ణ గ్రామస్థులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.