సీఎం రిలీఫ్ చెక్కులు అందజేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ తాడెం వెంగల్ రావు
19-05-2026 07:39 PM
చేగుంట,(విజయక్రాంతి): నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఒక వరమని మార్కెట్ కమిటీ చైర్మన్ తాడెం వెంగల్ రావు, చేగుంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ అన్నారు. మంగళవారం చేగుంట మండలం చిన్న శివనూరు గ్రామానికి చెందిన బొల్ల మహేష్ కు రూ.60,000, వల్లభపూర్ గ్రామానికి చెందిన బత్తుల కొమరయ్య కు రూ.15000, విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సి హెచ్ శ్రీనివాస్ రెడ్డి అదేశాల మేరకు వారి కుమారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బొల్ల ప్రశాంత్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.






