5 May, 2026 | 1:46 PM

Breaking News

పదవ తరగతిలో ప్రతిభ చాటిన శాలివాహన విద్యార్థులకు ఘన అభినందనలు   •   దేవరకొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌కు బీసీ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •   వడదెబ్బతో బాలిక మృతి   •   మిషన్ భగీరథ నీరు సరిగా అందడం లేదు: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్   •   కన్నాలలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం   •   రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు విస్తృతంగా నిర్వహించాలి   •   లింగుపల్లి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   UAEపై దాడులు, భారతీయులకు గాయాలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన!   •   “ITP Aero – India” ప్లాంటుకు శ్రీధర్ బాబు శంకుస్థాపన   •  

ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

21-11-2025 12:00 AM

ట్రాఫిక్ ఎస్‌ఐ కృష్ణ చైతన్య

నారాయణపేట క్రైమ్, నవంబర్ 20 : జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఎస్‌ఐ కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ... ప్రతి ఆటో డ్రైవర్ తప్పనిసరిగా సరైన పత్రాలు (లైసెన్స్, RC, ఇన్సూరెన్స్ మొదలైనవి) కలిగి ఉండాలని, వాహనాలలో అధిక సంఖ్యలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించు కోవద్దని సూచించారు.

ఎవరైనా ప్రయాణికులు తమ వస్తువులు బ్యాగ్ లు, ఇతర వస్తువులు వాహనంలో మరిచిపోయినట్లయితే, నిజాయితీగా వాటిని తిరిగి అందించి నీతిని పాటించాలని తెలిపారు.  ఆటోలను ఒక క్రమ పద్ధతిలో పార్క్ చేయాలనీ, రాష్ డ్రైవింగ్ చేయరాదని, ఎలాంటి ట్రాఫిక్ జామ్లు లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రజలకు భద్రత, సౌక ర్యం కల్పించడంలో ఆటో డ్రైవర్లు సహకరించాలని ఎస్త్స్ర కోరారు.