calender_icon.png 23 February, 2026 | 10:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏయూ రీసెర్చ్ స్కాలర్ సామేల్ మాథారికి పిహెచ్డి పట్టా

23-02-2026 08:37:15 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): అనురాగ్ విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన రీసెర్చ్ స్కాలర్  సమేల్ మాథారి తన విశిష్ట పరిశోధన గ్రంథం హైపర్ ట్యూన్డ్ ఎఫీషియండ్ యూరప్ నెట్వర్క్ ఫర్ ఇమేజ్ జరీడి సెక్షన్ కు ఈనెల 21న అనురాగ్ యూనివర్సిటీ క్యాంపస్‌లోని హెచ్-బ్లాక్, 4వ అంతస్తు, కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రతిష్ఠాత్మక డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పి.హెచ్.డి) పట్టాను అందుకున్నారు.

ఈ డాక్టరల్ పరిశోధనను డాక్టర్ ఎ. మల్లికార్జునరెడ్డి విశిష్ట పర్యవేక్షణ మార్గదర్శకత్వంలో విజయవంతంగా పూర్తి చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాధిపతిగా, అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఆయన అందించిన నిపుణులైన మార్గనిర్దేశం, దూరదృష్టి గల విద్యా నాయకత్వం, నిరంతర ప్రోత్సాహం ఈ ఉన్నతమైన  ప్రభావవంతమైన పరిశోధనను విజయవంతంగా పూర్తి చేయడంలో కీలక పాత్ర పోషించాయి.