థరూర్ కాన్వాయ్పై దాడికి యత్నం
- నేను క్షేమంగానే ఉన్నా.. ఆందోళన పడొద్దు
ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
తిరువనంతపురం, ఏప్రిల్ 4: కేరళలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కాన్వాయ్ను అడ్డగించి దాడికి ప్రయత్నించారు. దీంతో ఆయన భద్రతా బృందంలోని ఒక సభ్యుడిపై దాడి జరిగినట్లు ఆరోపణలున్నాయి. యూ డీఎఫ్ అభ్యర్థి ఏపీ అనిల్ కుమార్ తరఫున ప్రచారం చేసేందుకు థరూర్ వాండూర్ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. థరూర్ బృందం రెండు వాహనాల్లో ప్రయాణిస్తుండగా, 8 మంది ఈ వాహనాలను అడ్డగించా రు. దీన్ని వ్యతిరేకించిన భద్రతా బృందంలోని సభ్యుడు జోక్యం చేసుకున్నాడు. దీం తో అతనిపై దాడి జరిగినట్లు సమాచారం.
పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నా రు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనలో రాజకీయ కోణం లేదని పోలీసులు స్పష్టం చేశారు. అనంతరం థరూర్ తన సామాజిక మాధ్యమంలో మిత్రులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలుపుతూ తాను క్షేమంగానే ఉన్నానని, ఆందో ళన పడొద్దని చెప్పారు. కేరళ ఎన్నికల్లో యూడీఎఫ్ మెజార్టీ సాధిస్తుందని థరూర్ విశ్వాసం వ్యక్తం చేశారు. గెలిస్తే సీఎం ఎవరన్న ప్రశ్నకు బదులిస్తూ, కాంగ్రెస్ హైకమాం డ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు.




