నేడు గ్రీవెన్స్ హెల్ప్ డెస్క్ ద్వారా దరఖాస్తులు స్వీకరణ
20-07-2026 12:15 AM
కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్, జులై 19(విజయ క్రాంతి) : ప్రతీ సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 20 వ తేదీన జరిగే ప్రజావాణి కార్యక్రమం హెల్ప్ డెస్క్ ద్వారా దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20 వ తేదీన సోమవారం ఉమ్మడి జిల్లా మంత్రివర్యుల సమావేశం సంగారెడ్డిలో ఉన్నందున జిల్లా కలెక్టర్ తోపాటు వివిధ శాఖల అధికా రులందరూ సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాల యంలో సమావేశానికి హాజరు కావాల్సి ఉన్నందున అధికారులు అందుబాటులో ఉండరు. నేడు జరగాల్సిన గ్రీవెన్స్ దరఖాస్తు ల ని హెల్ప్ డెస్క్ ద్వారా స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. దయచేసి జిల్లా ప్రజలు ఈ విషయం గమనించగలరు.






