12 May, 2026 | 10:02 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

దర్గా అభివృద్ధికి రూ.8 కోట్లు కేటాయించండి

13-03-2026 01:24 AM

షాద్నగర్, మార్చి 12 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లాలోని ప్రసిద్ధగాంచిన జహంగీర్ పీర్ దర్గా సమగ్ర అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ను కోరారు. గురువారం హైదరాబాద్ లో మంత్రి కార్యాలయంలో ఆయనను ప్రత్యేకంగా కలుసుకున్న ఎమ్మెల్యే, దర్గా అభివృద్ధి పనుల పురోగతిపై చర్చించారు.ప్రస్తుతం దాదాపు రూ. 12 కోట్ల హెచ్.ఎం.డి.ఏ నిధులతో దర్గా వద్ద వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.

పెరుగుతున్న భక్తుల రద్దీ, సౌకర్యాల దృష్ట్యా మరో రూ. 8 కోట్ల అదనపు నిధులు అవసరమని ఎమ్మెల్యే వివరించారు. ఇటీవల తాను దర్గాను సందర్శించానని గుర్తు చేసిన మంత్రి అజారుద్దీన్, దర్గా అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ఉందన్నారు. నిధుల మంజూరుకు సానుకూలంగా స్పందిస్తూ, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జహంగీర్ పీర్ దర్గా మతసామరస్యానికి ప్రతీక అని భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి  పేర్కొన్నట్లు ఎమ్మెల్యే చెప్పారు.