మంత్రి పదవుల 'ఆశ'తోనే.. AIADMK ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్
చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో బుధవారం జరిగిన బలపరీక్షలో మంత్రి పదవుల ఆశకు లొంగిపోయి, AIADMK ఎమ్మెల్యేలలో ఒక వర్గం TVK ప్రభుత్వానికి అనుకూలంగా క్రాస్-ఓటింగ్ చేశారని వారి చర్య అన్యాయం, చట్టవిరుద్ధం" అని పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి ఆరోపించారు. సీనియర్ నాయకులు ఎస్.పి. వేలుమణి, సి.వి. షణ్ముగం నేతృత్వంలోని మొత్తం 25 మంది AIADMK ఎమ్మెల్యేలు, విశ్వాస తీర్మాన సమయంలో సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. "2011 నుండి AIADMK సాధించిన విజయాలను, ప్రజల సంక్షేమ చర్యలను ప్రముఖంగా చాటిచెప్పడం ద్వారా మేము 47 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నాము. ప్రజలు పార్టీ రెండు ఆకులు (Two Leaves) గుర్తుకే ఓటు వేశారు," అని పళనిస్వామి అసెంబ్లీ సమావేశాల అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు.






