10 May, 2026 | 9:06 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

ఎరువుల దుకాణాల్లో ఏడీఏ తనిఖీ

24-01-2026 08:14 PM

నంగునూరు,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను సిద్దిపేట ఏడీఏ పద్మ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దుకాణదారులు రైతులకు యూరియా కార్డుల ద్వారానే ఎరువులను పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ... ప్రభుత్వ వ్యవసాయ పథకాలు నేరుగా అందాలంటే రైతులందరూ తప్పనిసరిగా గుర్తింపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రాయితీపై అందుబాటులో ఉన్న వ్యవసాయ యంత్ర పరికరాల కోసం అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు. ఆమె వెంట మండల వ్యవసాయ శాఖ అధికారి గీత ఉన్నారు.