1 July, 2026 | 6:31 PM

Breaking News

ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •   గీతం 17వ గ్రాడ్యుయేషన్ డే ఆగస్టు 1న   •   రైతు భరోసా చారిత్రక ఘట్టం.. రైతుల కోసం లక్ష కోట్ల వ్యయం: ఎమ్మెల్యే రాగమయి   •  

ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన నేత

08-10-2025 12:00 AM

ఎమ్మెల్యే జారె

ములకలపల్లి / దమ్మపేట,అక్టోబర్ 7,(విజయ క్రాంతి):ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన మహానీయుడు కొమరం భీమ్ అని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కొనియాడా రు. కొమరం భీమ్ వర్ధంతి సందర్భంగా మంగళవారం గండుగులపల్లి క్యాంప్ ఆఫీస్ వద్ద ఆయ న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జల్ జంగల్ జమీన్ నినాదంతో నిజాం పాలకులకు వ్యతిరేకంగా పోరాడి ఆదివాసీల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని గుర్తు చేశారు.

ఆయన పోరాటం అణగారిన వర్గాల స్వయంపాలన స్వాభిమానం కోసం సాగిన చరిత్రాత్మక ఉద్యమమని, ఆయన చూపిన ధైర్యం త్యాగం నేటి తరానికి స్ఫూర్తి అన్నారు.కొమరం భీమ్ వర్ధంతి కేవలం సంస్మరణ దినం కాకుండా గిరిజనుల హక్కుల పరిరక్షణకు పునరంకితం కావాల్సిన రోజుగా నిలపాలని ఆయన పిలుపునిచ్చారు. కొమరం భీమ్ ఆశయాల సాధనలో భాగంగా ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాలకు చెందిన ఆదివాసీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.