1 July, 2026 | 7:33 PM

Breaking News

డిబిఎమ్ 6 కాల్వకు గండి   •   ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో శాతవాహన అవగాహన ఒప్పందం   •   సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •  

నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం

01-07-2026 06:25 PM

సిపిఐ  నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి

ముకరంపుర,(విజయక్రాంతి): అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేయాలని సిపిఐ  నగర సమితి ఆధ్వర్యంలో కరీంనగర్ ఎమ్మార్వో రాజేష్ కు వినతి పత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ... మండలంలోని అనేక గ్రామాల్లో ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థిక స్థోమత లేక సొంత స్థలం లేక వారు  చిన్న గదుల్లోనే నివసిస్తున్న కుటుంబాలు ఉన్నాయని, ప్రభుత్వ భూములను గుర్తించి అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వం  పైన ఉందని అన్నారు.

చాలామందికి ఇండ్లు లేక,ఆర్థిక స్థోమత అందక ప్రభుత్వ చేయూత కోసం ఎదురుచూస్తున్నారని, కరీంనగర్  శివారు చింతకుంట లో కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే పేదలకు ఇవ్వాలని, ప్రభుత్వం నెలరోజుల్లో అర్హులైన పేదలకు చింతకుంట, తీగలగుట్టపల్లిలో కట్టిన ఇండ్లను ఇవ్వకపోతే సిపిఐ ఆధ్వర్యంలో  ఇండ్లను ఆక్రమిస్తామని, ప్రభుత్వ స్థలాలను గుర్తించి నిరుపేదలకు ఇల్లు కట్టించకపోతే సిపిఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ స్థలాలలొఎర్రజెండాలు పాతీ  ప్రజలకు పంచుతామని సురేందర్ రెడ్డి హెచ్చరించారు.