13 May, 2026 | 12:50 PM

Breaking News

విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •   ములాయం సింగ్ కుమారుడు హఠాన్మరణం— అఖిలేష్ యాద‌వ్ ఇంట్లో తీవ్రవిషాదం   •  

నల్గొండలో దారుణం.. ప్రియుడి భార్యపై పెట్రోల్‌ పోసి..

31-01-2026 04:37 PM

హైదరాబాద్: నల్గొండ జిల్లాలోని(Nalgonda district) నాంపల్లి మండలం కేతేపల్లిలో మహిళ దారుణ హత్యకు గురైంది. సుజాత అనే మహిళ మమత(25)పై పెట్రోల్ పోసి నిప్పంటించింది. మమత భర్త నగేశ్ తో అదే గ్రామానికి చెందిన సుజాతకు వివాహేతర సంబంధం ఉందని గ్రామస్తులు తెలిపారు. సుజాత మమతతో మధ్యాహ్నం గొడవ పడి పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది. ఈ ప్రమాదంలో మమత మృతి చెందగా, ఆమె చేతిలో ఉన్న 5 నెలల కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. సగం కాలిన గాయాలతో చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన తర్వాత సుజాత అక్కడి నుంచి పారిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మమత భర్త నగేశ్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.