2 May, 2026 | 1:08 PM

Breaking News

అత్తను హెల్మెట్‌తో కొట్టి చంపిన అల్లుడు... పట్టించిన సీసీటీవీ ఫుటేజ్   •   వెలిమినేడు నోష్ ల్యాబ్ వద్ద కార్మికుల ధర్నా   •   ‘ప్రజాదర్బార్’లో ప్రజల సమస్యలకు పరిష్కారం – ప్రజల వద్దకే పాలన   •   శంషాబాద్ ORR ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళి   •   లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దం   •   విజయ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. గంటల తరబడి వేచి ఉన్న అభిమానులు   •   ప్రియుడు మోసం చేశాడని.. పోలీస్ స్టేషన్‌పై నుంచి దూకేసిన యువతి   •   రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌పై కేసు నమోదు   •   బెంగాల్‌లో రీపోలింగ్: తొలి 2 గంటల్లో 16.23 శాతం ఓటింగ్   •   వడ్లు కొనుగోలులో జాప్యం.. రాఘవాపూర్ చౌరస్తాలో రైతుల ధర్నా   •  

మిలియన్ మార్చ్ స్ఫూర్తితో ముందుకెళ్దాం

10-03-2026 02:39 PM

మిలియన్ మార్చ్@15ఏళ్లు 

హైదరాబాద్: ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన ఘట్టం మిలియన్ మార్చ్(Million March) కు 15 ఏళ్లు అయిందని మాజీ మంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) అన్నారు. ట్యాంక్ బండ్ మీద తెలంగాణ ఆత్మగౌరవం ఉప్పొంగిన రోజు అని ఆయన వెల్లడించారు. ఆనాటి పోరాట స్ఫూర్తి ప్రతి తెలంగాణ బిడ్డ గుండెల్లో ఇప్పటికీ సజీవంగా ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మన హక్కుల కోసం, మన అస్తిత్వం కోసం కొట్లాడామని గుర్తుచేశారు. నేడు మన వనరులను మళ్లీ దోచుకోవాలని చూస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మిలియన్ మార్చ్ స్ఫూర్తితో ముందుకెళ్దామని ఆయన పిలుపునిచ్చారు.