14 July, 2026 | 11:21 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

ఇంటివద్దనే పురుడు పోసిన 108 సిబ్బంది

01-04-2026 12:32 AM

ఈఎంటీ సీతారాం వెల్లడి

మేడ్చల్ అర్బన్ మార్చి 31 (విజయక్రాంతి): పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి 108 అంబులెన్స్ సిబ్బంది ఇంటి వద్దనే పురుడు పోసినట్లు 108 అంబులెన్స్ ఈఎంటి సీతారాం వెల్లడించారు. మునీరాబాద్ కు చెందిన సమంజ సద భార్య ఆర్తి కుమారి వయస్సు (22)పురిటి నొప్పులతో బాధపడుతుంటే 108 అంబులెన్స్ కి ఫోన్ చేయడంతో గుండ్లపోచంపల్లికి చెందిన 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి సీతారాం,

పైలట్ అశోక్ హుటాహుటిన  చేరుకొని ఇంటి వద్దనే పురుడు పోశారు.ఈ నేపథ్యంలో ఆర్తి కుమారికి నొప్పులు అధికం అవ్వడంతో ఆసుపత్రికి వెళ్లే సమయం లేదని గమనించిన ఈఎంటి సీతారాం,ఈ.ఆర్.సి.పి డాక్టర్ స్మిత సూచనల మేరకు ఇంటి వద్దనే పురుడు పోసినట్లు చెప్పారు.బాధితురాలు ఆర్తి కుమారి అంబులెన్స్ సిబ్బంది సహకారంతో పండంటి ఆడబిడ్డకి ఉదయం 9:30 గంటలకు జన్మనిచ్చిందని చెప్పారు.

పురిటి నొప్పులతో బాధపడుతున్న బాధితురాలి బిడ్డ తల్లి ఇద్దరు క్షేమంగా ఉన్నారని 108 అంబులెన్స్ సిబ్బంది తెలిపారు.బాధితురాలి కి డెలివరీ జరిగిన తర్వాత తదుపరి సంరక్షణ కోసం తల్లి బిడ్డలను దగ్గరలో ఉన్న మేడ్చల్ కమ్యూనిటీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని 108 సిబ్బంది తెలియ జేశారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి తల్లి బిడ్డలను కాపాడినందుకు ఆర్తి కుమారి కుటుంబ సభ్యులు 108 సిబ్బంది ఈఎంటి సీతారాం తో పాటు పైలట్ అశోక్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు....